ఏకాభిప్రాయం తెచ్చిన పెంట.. కీర్తికి మంట!
on Dec 1, 2022
బిగ్ బాస్ హౌస్ లో 'టికెట్ టు ఫినాలే' రేస్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మొదటి లెవెల్ పూర్తి అయ్యే సమయానికి శ్రీసత్య, ఇనయా రేస్ నుండి తొలగిపోయిన విషయం తెలిసిందే. కాగా రేస్ లో ఇంకా ఆరుగురు సభ్యులు ఉండగా 'జెండాల జగడం' టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో ఆరుగురు పాల్గొన్నారు. "అయితే ఇందులో నుండి నలుగురు మాత్రమే తర్వాతి లెవెల్ కి వెళ్తారు. వారు ఎవరో మీరే ఏకాభిప్రాయంతో ఎంపిక చేసుకోండి" అని బిగ్ బాస్ చెప్పగా, అందరూ కొంతసేపు ఆలోచించారు.
అందురు కూడా "ఏకాభిప్రాయం వద్దు బిగ్ బాస్.. మీరే చెప్పండి" అంటూ కెమెరాలకి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎవరికి వారు "మేము తర్వాత లెవెల్ కి వెళ్ళాలనుకుంటున్నాం" అని చెప్పారు. శ్రీహాన్ మాట్లాడుతూ "నన్ను ఏకాభిప్రాయంతో ఎవరన్నా తీసేస్తే ఎవడిని గెలవనివ్వను.. ప్లేట్లు అన్ని పగులగొడతాను" అని అన్నాడు. ఆ తర్వాత రేవంత్ కూడా నాది సేమ్ డైలాగ్ అంటూ అలాగే వార్నింగ్ ఇచ్చాడు. "కంటెస్టెంట్స్ అంతా ఏకాభిప్రాయం తీసుకోవడంలో విఫలం అయ్యారు కాబట్టి సంచాలకులుగా ఉన్న ఇనయా, శ్రీసత్య మీరు ఇద్దరు కలిసి ఏ నలుగురు అయితే తర్వాత లెవల్ కి వెళ్ళాలనుకుంటున్నారో ఏకాభిప్రాయంతో డిసైడ్ చేసుకొని చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికి "లీస్ట్ ఉన్న రోహిత్, ఇంకా కీర్తీలను రేస్ నుండి తొలగిస్తున్నాం బిగ్ బాస్" అని చెప్పారు.
దీంతో హౌస్ లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. కీర్తీ, ఇనయాల మధ్య గొడవ జరిగింది. "కీర్తి.. మాకు వేరే ఆప్షన్ లేదు. అక్కడ లీస్ట్ లో ఎవరు ఉన్నా ఇలానే చేస్తాం" అని ఇనయా చెప్పగా, "గ్రేట్ డెసిషన్ " అంటూ కీర్తి వెటకారంగా అంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. చివరగా కీర్తి కంటతడి పెట్టగా, హౌస్ మేట్స్ వచ్చి ఓదార్చారు.
Also Read